లిక్కర్‌ షాపులతో లాక్‌డౌన్‌ లక్ష్యం మంటకలిసింది.

చిన్నిచిన్న షాపులకు కూడా ఎందుకు అనుమతి ఇవ్వరు?

సర్కార్‌ తీరుపై  మండిపడ్డ ఎంపి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,మే11(ఇయ్యాల తెలంగాణ ): తెంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే లిక్కర్‌ ఓపెన్‌ చేశారో.. అప్పుడే ప్రజల్లో కొరొనా భయం పోయిందని కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి అన్నారు. వైన్‌ షాపుల  దగ్గర వంద మంది గుంపుగా ఉన్నప్పుడు రాని కరోనా.. ఒక్కరిద్దరు పొట్టకూటి కోసం పని చేసుకునే మెకానిక్‌ షాప్స్‌ ద్వారా వస్తుందా? అని ప్రశ్నించారు? వైన్‌ షాపులకో న్యాయం.. చిన్న షాపులకో న్యాయమా? అన్నారు. లాక్‌డౌన్‌లో వేలకోట్ల బిజినెస్ లను  పోగొట్టుకొని వ్యాపారులు ప్రభుత్వానికి సహకరిస్తే .. వైన్స్‌ షాప్స్‌ తెరవడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందన్నారు. 45రోజుల  వ్రతాన్ని ఒక్క రోజుతో కేసీఆర్‌ లిక్కర్‌ షాప్స్‌ తెరవడంతో ఆగమాగం అయిందని..ఎవరి ప్రాధాన్యత వాళ్లకు ఉంటుందన్నారు. ప్రభుత్వానికి లిక్కర్‌ ప్రాధాన్యత అయినప్పుడు.. చిరు వ్యాపారులకు కుటుంబాన్ని పోషించుకునేందుకు వాళ్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, అహ్మదాబాద్‌, ఏరియాల్లో ఎక్కువగా కేసులు  పెరగడానికి కారణం నమస్తే ట్రంప్‌ విూటింగ్‌ అన్నారు. మర్కజ్‌కి వెళ్ళింది 10వే మంది మాత్రమేనని.. కానీ నమస్తే ట్రంప్‌ విూటింగ్‌కు లక్ష మంది అటెండ్‌ అయ్యారన్నారు. ప్రపంచ టూరిజమ్‌ ప్రాంతం అయిన గోవాలో కేసులు  లేవు. కానీ గుజరాత్‌, మహారాష్ట్రలో కేసులు  ఎక్కువని అన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, సమస్యలను కూడా ప్రస్తావించలేకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు అధికార పార్టీలు  తప్ప ఎవ్వరికి అవకాశం లేదని .. స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, ప్రతిపక్షాలతో మాట్లాడి గొంతును ప్రజలకు చేరవేసే వాళ్ళని.. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్‌ అయిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....