ఆంక్షలతో వ్యాపార,వాణిజ్య కార్యకలాపాకు అనుమతి
రేపటి నుంచి బస్సులు నడుపుకోవచ్చు
అన్ని రకాల విద్యాసంస్థలు , శిక్షణా కేంద్రాలు బంద్
సినిమా థియేటర్లు, పంక్షన్ హాల్స్కు అనుమతి లేదు.
లాక్డౌన్ 31 వరకు పొడిగింపు
బార్లు, పబ్బులు , క్రీడామైదానాలు .,క్లబ్లు , జిమ్లు , పార్కులు బంద్
మెట్రో రైలు సర్వీసులు బంద్,నగరంలో సిటీ బస్సుకు అనుమతి లేదు
అన్ని రకాల ప్రార్థనా మందిరాలు , దేవాయాలు మూసే ఉంచాలి.
హైదరాబాద్,మే18(ఇయ్యాల తెలంగాణ): కరోనాతో కలసి ప్రయాణించడం తప్పదు కనుక సడలింపు మేరకు ముందుకు సాగాల్సి ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్రం ప్రకటించిన మేరకు మే 31 వరకూ తెంగాణలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెంగాణ కేబినెట్ భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని ప్రాంతాల్లో వ్యాపార,వాణిజ్య వర్గాలకు అనుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు నడుస్తాయని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. జిల్లాకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. అయితే అంతర్ రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేదన్నారు. అలాగే హైదరాబాద్లో ఆటోలు , ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ట్యాక్సీ, ఆటోల్లో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఈనె 31 వరకూ మెట్రో రైలు సర్వీసు నడపబోమన్నారు. కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అన్ని షాపులు తెరుచు కోవచ్చని స్పష్టం చేశారు. సరిబేసి సంఖ్యలో మాత్రమే షాపులు తెరవాలన్నారు. అలాగే కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సెలూన్లు, ఓపెన్ చేయొచ్చని తెలిపారు. ఈ` కామర్స్ సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. .ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాలు వందశాతం పనిచేస్తాయన్నారు. పరిశ్రమలు , ఫ్యాక్టరీలు , తయారీ యూనిట్లు పనిచేస్తాయని వివరించారు. అన్ని ప్రార్థనా మందిరాలకు అనుమతి లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని’ సీఎం వివరించారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపు ఇస్తున్నా.. రాష్ట్రంలో వీటికి మాత్రం అనుమతు ఉండబోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.