రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’, రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల..

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియన్‌ లవ్‌ స్టోరీ రాధే శ్యామ్‌. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్‌ లో వేగం పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ముంబైలో ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేసారు. ఈ రిలీజ్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ముఖ్యంగా అత్యద్భుతమైన విజువల్స్‌తో నిమిషం నిడివి గల ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్‌లో సినిమా ఎలా ఉండబోతుందో.. ఎంత ఘనంగా ఉండబోతుందో చూపించారు. ప్రేమకు, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. ఓ విధంగా సినిమాకు కర్టెన్‌ రైజర్‌ ఇది. సినిమాపై అంచనాలు రెండిరతలు పెంచేసింది. చిత్ర యూనిట్‌తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్‌ చేయనున్నారు. హైదరాబాద్‌, ఢల్లీి, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరగనున్నారు. దీని కోసం పూర్తిగా బిజీ షెడ్యూల్‌ సిద్ధం చేసుకున్నారు ప్రభాస్‌. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్‌ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో పాన్‌ ఇండియన్‌ దర్శకుడు రాజమౌళి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. అలాగే కన్నడలో శివరాజ్‌ కుమార్‌.. మలయాళంలో పృథ్విరాజ్‌ సుకుమారన్‌.. తమిళంలో సత్యరాజ్‌ రాధే శ్యామ్‌ సినిమా కోసం వాయిస్‌ ఓవర్‌ అందించనున్నారు. 

హిందీలో బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ రాధే శ్యామ్‌ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్‌ రిలీజ్‌ చేయబోతున్నారు మేకర్స్‌. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌, అర్జిత్‌ సింగ్‌, మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌, జబిన్‌ నౌతీయల్‌, మనోజ్‌ ముంటాషిర్‌, కుమార్‌, రష్మీ విరాగ్‌ బృందం అంతా కలిసి సౌత్‌, నార్త్‌ వర్షన్స్‌కు రాధే శ్యామ్‌ సినిమాకు అద్భుతమైన క్లాసిక్‌ సంగీతం అందిస్తున్నారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్‌ కన్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్‌ వర్క్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌ ప్రొడక్షన్స్‌ వాల్యూస్‌ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్‌ చేశారు. సౌండ్‌ ఇంజనీర్‌ రసూల్‌ పూకుట్టి వర్క్‌ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్‌ 11, 2022న సినిమా విడుదల కానుంది.నటీనటులు: ప్రభాస్‌, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌, ప్రియదర్శి తదితరులు.. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....