రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన ‘బేబీ’ సినిమా మేకర్స్‌ ..

ఆకట్టుకునే 70 అడుగుల పోస్టర్‌ తో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన ‘బేబీ’ సినిమా మేకర్స్‌ ..ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య లు కలిసి నటించిన మూవీ బేబీ.కలర్‌ ఫోటో లాంటి నేషనల్‌ అవార్డ్‌ సినిమాను ప్రొడ్యూస్‌ చేసిన సాయి రాజేష్‌  దర్శకత్వంలో బేబీ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ నుంచి విడుదలైన టీజర్‌ మరియు సాంగ్స్‌ ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మొదటి వీడియో గ్లిమ్స్‌ వచ్చిన దగ్గరి నుంచే ఈ చిత్రం పైన ప్రేక్షకులందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి సాంగ్‌ తెలుగు సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్‌ రెట్టింపు అవ్వ సాగాయి. ఇక ఇప్పుడు ఆనంద్‌ దేవరకొండ తో విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ ‘బేబీ’ మూవీ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది. ఇదే విషయాన్ని ప్రసాద్‌ ఐ`మాక్స్‌ దగ్గర దాదాపు 70 అడుగుల విడుదల తేదీ పోస్టర్‌ తో ప్రకటించారు ఈ సినిమా యూనిట్‌. ఈ చిత్రం టీజర్‌ మరియు సాంగ్స్‌ లాగానే కొత్త పోస్టర్‌ డిఫరెంట్‌ గా, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.ఈ విడుదల తేదీ పోస్టర్‌ లాంచ్‌ కి ఆనంద్‌ దేవరకొండ,విరాజ్‌ అశ్విన్‌ ,వైష్ణవి చైతన్యలతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌ అలానే ఈ సినిమా నిర్మాత ఎస్‌ కే ఎన్‌, కో ప్రొడ్యూసర్‌ ధీరజ్‌ అటెండ్‌ అయ్యారు. ఒక ఇంటెన్స్‌ లవ్‌ స్టొరీ తో అందరికీ నచ్చే అంశాలతో జూలై 14న ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది టీమ్‌.యితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో, ఈ చిత్ర యూనిట్‌ ఈ సినిమా ట్రైలర్‌ ని వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు, అలానే ఈ చిత్ర ప్రమోషన్స్ని ఇక జోరుగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ చిత్రాన్ని సాయిరాజేశ్‌ డైరెక్ట్‌ చేశారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్‌ : విప్లవ్‌ నైషధం, సినిమాటోగ్రఫీ : ఎమ్‌ఎన్‌ బాల్‌ రెడ్డి అందిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....