ముస్లిం సోదరులకు మోదీ ఈద్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,  ఏప్రిల్‌ 22 (ఇయ్యాల తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సామరస్యాలు, కారుణ్యం మన సమాజంలో మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, సుఖ, సంతోషాలతో, సౌభాగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈద్‌`ఉల్‌`ఫితర్‌ సందర్భంగా దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ ప్రేమ, కారుణ్యాలకు సంబంధించిన పండుగ అని తెలిపారు. ఇతరులకు సహాయపడాలనే సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. మనమంతా కలిసికట్టుగా సమాజంలో సోదరభావాన్ని వృద్ధి చేద్దామని శపథం చేద్దామని పిలుపునిచ్చారు.మన దేశంలో అతి పెద్ద మసీదుల్లో ఒకటైన ఢల్లీిలోని జామా మసీదులో వందలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. నమాజు చేసిన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. నెల రోజులపాటు ఉపవాస దీక్షల అనంతరం ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఢల్లీి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....