మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌ లో చర్చ

హైదరాబాద్‌, సెప్టెంబర్ 20 (ఇయ్యాల తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతి భవన్‌ లో కీలక సమావేశం మంగళవారం జరిగింది. సిఎం కేసీఆర్‌ పిలుపుతో మంత్రి జగదీష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి  ఉదయమె హుటాహుటిన ప్రగతిభవన్‌ కు చేరుకున్నారు. అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించాలనే అంశంపై చర్చ కొనసాగినట్లు సమాచారం. త్వరలో  అధికారికంగా అభ్యర్ధి పేరు ప్రకటించే అవకాశం వుంది. మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పార్టీ కేడర్‌ కు కూసుకుంట్ల అభ్యర్దిగా కేసీఆర్‌  సంకేతాలు పంపిన విషయం తెలిసిందే. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వేదికగా కూసుకుంట్ల పేరును ఎక్స్పోజ్‌ చేయాలని మంత్రి జగదీష్‌ రెడ్డికి సూచించినట్లు సమాచారం. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....