మమతా పై అమిత్ షా ఫైర్ – వలస కూలీలను అవమానిస్తే ఊరుకోము


వలస కూలీలను అవమానించిన మమతా

వర్చువల్‌ ర్యాలీలో మండిపడ్డ అమిత్‌ షా

న్యూఢిల్లీ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ):  వలస కూలీలను తరలించే శ్రామిక్‌ రైళ్లను కరోనా ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టిన దీదీపై అమిత్‌ షా ఫైర్‌ అయ్యారు. కరోనా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లే విూ రాజకీయ జీవితానికి చరమగీతం పాడనున్నట్లు షా హెచ్చరించారు. ఎంతో ఇబ్బందుల్లో ఉన్న  వలస కూలీలను మమతా బెనర్జీ కించపరిచిందన్నారు.  వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేత అమిత్‌ షా ప్రచారం మొదలు పెట్టారు.  ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జన్‌ సంవాద్‌ ర్యాలీలో ప్రసంగించారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై షా తీవ్ర విమర్శలు  చేశారు.శ్రామిక్‌ రైళ్లను నడుపుతూ వైరస్‌ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం కారణమైందని మమతా ఇటీవల  ఆరోపించారు. వర్చువల్‌ సభలో బీజేపీ వర్కర్లతో మాట్లాడిన అమిత్‌ షా.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన మమతా బెనర్జీ భారీ మ్యూల్యం  చెల్లించాల్సి ఉంటుందన్నారు. బెంగాల్‌ ప్రజలే మమతా బెనర్జీని రాజకీయ శరణార్థిగా మారుస్తారని ఆయన విమర్శించారు. లాలుచీ రాజకీయాలను అంతం చేసేందుకు సీఏఏ సమర్థవంతమైనదని, బెంగాల్‌ ప్రజలు  దీని గురించి తెలుసుకోవాలన్నారు. దశాబ్దాలుగా శరణార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ చట్టం అడ్డుకుంటుందని షా అన్నారు.   దేశవ్యాప్తంగా అంతటా ప్రజాస్వామ్యం వెల్లి విరుస్తుంటే, ఒక్క బెంగాల్‌లో మాత్రమే రాజకీయ హింస తారాస్థాయికి చేరిందన్నారు. హింస రాజకీయాలను బెంగాల్‌ సీఎం ప్రోత్సహిస్తున్నట్లు షా ఆరోపించారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....