భాగ్యలక్ష్మీ ఆలయంలో పంజాబ్ హరియాణ జస్టిస్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్, డిసెంబర్ 26 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆదివారం పంజాబ్ హరియాణ హై కోర్టు జస్టిస్ రాజబీర్ శేరావత్  అమ్మవారిని  దర్శించుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ  అమ్మవారి ఆశీసులు పొందడంతో పాటు అమ్మవారి దర్శన భాగ్యం కలుగడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్బంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ సంప్రదాయాల కనుగుణంగా జస్టిస్ రాజ్ బీర్ శేరావత్ కు ఘన సన్మానం చేశారు. అమ్మవారి దర్శన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఆయనకు అందజేశారు. ఆయన వెంట ఆయన సతీమణి కూడా చార్మినార్  భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....