భర్త చితాభస్మాన్ని భార్యకు అప్పగించండి

మధుసూధన్‌ రావు కేసులో హైకోర్టు ఆదేశాలు


హైదరాబాద్‌,జూన్‌,5 (ఇయ్యాల తెలంగాణ): నగరంలోని వనస్థలిపురానికి చెందిన అల్లం పల్లి మధుసూదన్‌ కరోనా వైరస్‌తో మృతిచెందాడని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది. అతని మరణ ధృవీకరణ పత్రం, చితాభస్మం తమ వద్ద ఉన్నాయని కోర్టుకు వివరించింది. కాగా తన భర్త మధుసూదన్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చిన తర్వాత అతని ఆచూకీ తెలియలేదంటూ భార్య మాధవి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు  చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ అతను కరోనాతో మృతిచెందితే కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వరా అని నిలదీసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం పూర్తి వివరాలను కోర్టుకు వివరించింది. కరోనా కారణంగానే మధుసూదన్‌ మృతి చెందాడని పేర్కొంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అతని మరణ ధృవీకరణ పత్రంతో పాటు చితాభస్మం అతని భార్య మాధవికి అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ వి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణనను ఈ నెల 9 కి వాయిదా వేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....