బుద్దపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
సంబరాల్లో పాల్గొనే అవకావం లేకుండా పోయిందని వ్లెడి
న్యూఢీల్లీ,మే7(ఇయ్యాల తెలంగాణ ): దేశ ప్రజలకు ప్రధాని మోదీ బుద్దపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దేశాన్ని ఉద్దేశించి వీడియో ప్రసంగం చేశారు.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను నేరుగా బుద్దపూర్ణిమ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నట్లు చెప్పారు. సంబరాల్లో పాల్గొంటే సంతోషంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితు అలా లేవన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే విధానమే భారత సంస్కృతిని ముందుకు నడిపిందన్నారు. భారతీయ నాకరికత, సాంప్రదాయా వృద్ధి కోసం గౌతమ బుద్దుడు ఎంతో చేశారన్నారు. బుద్దుడు స్వయం ప్రకాశితుడయ్యారని, ఆయన జీవితం ఎంతో మందికి జీనవమెగును ప్రసరించిందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అనేక మంది 24 గంటు ఇతరు కోసం పనిచేస్తున్నారని, శాంతి భద్రత పరిరక్షణకు ప్రయత్నిస్తున్నారని, వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారని, పారిశుద్ధం పాటిస్తున్నారని, వారంతా త్యాగమయ జీవితాన్ని గడుపుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. వారందరినీ ప్రోత్సహించాల్సిన, గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉండేందుకు ప్రతి ఒకరూ నిుచున్నారని, ఎటువంటి వివక్ష లేకుండా సహాయం చేస్తున్నారన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాకు సహకరించేందుకు భారత్ నిత్యం పనిచేస్తున్నదని, అసిపోయిన తర్వాత ఆగిపోతే సమస్యకు పరిష్కారం ఉండదని, అందరం కలిసి కరోనాను ఓడించాలని మోదీ అన్నారు.