సనత్ నగర్, మే 15 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా సంఘీభావంగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా తుక్కగూడకు విచ్చేయుచున్నందున దాదాపు ఐదు లక్షల మంది కార్యకర్తలను సమీకరించాల్సిందిగా సంకల్పించడమైనది. కావున బీజేపీ సభ్యులందరినీ అత్యధిక సంఖ్యలో ఈ ముగింపు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అనగా శనివారం మధ్యహ్నం గం.2.30 ని. లకు సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నుండి తరలి వెళ్ళే కార్లను జెండా ఊపి ప్రారంభించిన నాయకులు. బీజేపీ సనత్ నగర్ పరివార్ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, చరణ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్, ఆకూరి శ్రీనివాస్ రావు, పొలిమేర సంతోష్ కుమార్, వై శ్రీనివాస్ రావు, మల్లిఖార్జున్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, దశరథ్, సుధాకర్, లక్ష్మణ్, కుషాల్, బే వి శ్రీనివాస్, రమేష్, గోపి తదితరులు తరలివెళ్ళినట్లు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పొలిమేర సంతోష్ కుమార్ తెలిపారు.
- Homepage
- Sanath Nagar News
- బీజేపీ ఓబీసీ మోర్చా & సనత్ నగర్ పరివార్ తుక్కుగూడ వెళ్లిన దృశ్యాలు
బీజేపీ ఓబీసీ మోర్చా & సనత్ నగర్ పరివార్ తుక్కుగూడ వెళ్లిన దృశ్యాలు
Leave a Comment