బాలీవుడ్‌ బిగ్‌ ఆఫర్‌ వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ బిగ్‌ ఆఫర్‌ వదులుకున్న స్టార్‌ హీరోయిన్‌

టాలీవుడ్‌ న్యూస్,  ఇయ్యాల తెలంగాణ  మే 9 : ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుని టాప్‌ హీరోయిన్‌ గా పాపులర్‌ అయిపోయింది కీర్తి సురేష్‌. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అలనాటి నటి సావిత్రమ్మ బయోపిక్లో నటించే అవకాశం ఆమెను వరించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది కాబట్టే ఈరోజు ఆమెను అందరూ ‘సావిత్రమ్మ’గానే గుర్తు పెట్టుకున్నారు.

మహానటి తర్వాత ఆమెకు అవకాశాలు  అన్ని ఇండస్ట్రీ నుంచి వచ్చి పడుతున్నాయి. బాలీవుడ్‌ నుంచి కూడా పిలుపు వచ్చిందంటే  కీర్తికి ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో తొలి సినిమాలోనే అజయ్‌ దేవగణ్‌ లాంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో ‘మైదాన్‌’ అనే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే సినిమా రాబోతోందని వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి కీర్తి తప్పుకున్నారని బాలీవుడ్‌ తెలిపాయి.

ఈ విషయం గురించి నిర్మాత బోనీ కపూర్‌ కూడా అప్పట్లో వెల్లడించారు.  దీనికి కారణం.. కీర్తి చూడటానికి చాలా యంగ్ గా  కనిపిస్తున్నారట. ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి అజయ్‌ భార్య పాత్రలో నటించాల్సి ఉంది. కానీ కీర్తి ఆయన పక్కన చిన్న పిల్లలా  కనిపిస్తున్నారట. కనీసం వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్తోనూ ఆమె లుక్కును  మార్చలేని పరిస్థితి. అదీకాకుండా ‘మహానటి’ సినిమాలో 27 ఏళ్ల కీర్తి 45 ఏళ్ల సావిత్రి పాత్రలో నటించారు.

 ఆ తర్వాతి సినిమాలో కూడా పెద్ద వయసున్న మహిళ పాత్రలో నటిస్తే కీర్తికి ఇలాంటి పాత్రలే వస్తాయని అనుకునే ప్రమాదం కూడా ఉందని బోనీ అభిప్రాయపడ్డారట. అందులోనూ కీర్తి నటిస్తున్న తొలి హిందీ సినిమా ఇదే.

ఆరంభంలోనే ఇలాంటి సమస్యలు  ఎదురైతే మున్ముందు కెరీర్‌ దెబ్బతినే అవకాశం ఉందని కీర్తి వదులుకుందట. ఇక తాజాగా కీర్తికి బిగ్‌ బడ్జెట్‌ మూవీలో గ్లామర్‌ రోల్స్‌ వస్తున్నాయట. ఇంతవరకు గ్లామర్‌ రోల్‌ చేయని కీర్తి ఈ కొత్త ఆఫర్స్‌ కూడా రిజెక్ట్‌ చేసిందట.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....