ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ ,మే29(ఇయ్యాల తెలంగాణ ):  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల  4 వేల  397 మంది కరోనా  వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల  సంఖ్య 29 లక్షల  62 వేల  865. కోవిడ్‌`19 కారణంగా ఇప్పటి వరకు  ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల  61 వేల  998 మంది వ్యక్తులు  చనిపోయారు. వ్యాధి నుంచి 25 లక్షల  79 వేల  534 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురయ్యింది. ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌`19తో యూఎస్‌ఏ లో ఇప్పటి వరకు 1,03,330 మంది చనిపోయారు. కోవిడ్‌`19 కారణంగా అత్యధిక మరణాలు  సంభవించిన వివిధ దేశాల  వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్‌`26,764, రష్యా`4,142, స్పెయిన్‌`27,119, యూకే`37,837, ఇటలీ`33,142, ఫ్రాన్స్‌`28,662, జర్మనీ`8,570, టర్కీ`4,461, ఇరాన్‌`7,627, పెరూ`4,099, కెనడా`6,877, చైనా`4,634, మెక్సికో`9,044, పాకిస్థాన్‌`1,260, బెల్జియం`9,388, నెదర్లాండ్స్‌`5,903, ఈక్వెడార్‌`3,313, స్వీడన్‌`4,266, పోర్చుగల్‌`1,369, స్విర్జర్లాండ్‌`1,919, ఐర్లాండ్‌`1,639, ఇండోనేషియా`1,496, పోలాండ్‌`1,038, రోమేనియాలో 1,235 మంది చనిపోయారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....