ప్రజల పన్నులతోనే పరిపాలన.. పాలకులు తెలుసుకోవాలి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ


హైదరాబాద్‌ అక్టోబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ ):ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే పరిపాలన సాగిస్తున్నామని పాలకులు తెలుసుకోవాలని  హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. రాజకీయం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదని.. మిగతా అన్నిరంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజంగా పరిగణించబడుతుందని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాడైరీ 23వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సమాజంలో పలు రంగాలల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నవారికి అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రధాని నూతన విద్యావిధానం అమలుల్లోకి తేవడం వల్ల మాతృ భాష ప్రాముఖ్యత పెరిగిందని, తాను ఒకసారి అంతర్జాతీయ వేదికపై ప్రసంగించాల్సి వచ్చినప్పుడు హిందీలోనే మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాహితం కోరే వారిని, సమాజ అభివృద్ధికి పాటుపడే వారిని ప్రజాడైరీ పత్రిక సన్మానించడం సంతోషకరం అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రజాడైరీ సంపాదకుడు వి. సురేష్‌తో కలిసి ఎంటర్‌టైన్మైంట్‌ రంగంలో ప్రముఖుడిగా పేరు పొందిన రాజు ఎంటర్‌ టైన్మెంట్‌ ఈవెంట్స్‌ డేవిడ్‌ రాజు, సినీ నటుడు శివాజీ రాజా, చంద్రకాంత్‌, ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, సోలార్‌ సైంటిస్ట్‌ రమేష్‌ తదితరులను ఘనంగా సన్మానించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....