పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి : ప్రధాని మోడీ

 ప్రకృతికి ఎంతో కొంత అందించాలి’:  మాతృభూమిని సంరక్షించండి…:  మోడీ

న్యూఢిల్లీ, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) : 

‘‘నదులు తమ నీటిని తాగవు.. 

చెట్లు తమ పండ్లను తినవు. 

మేఘాలు కూడా తమ నీటి ద్వారా ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాలను తినవు.. 

ప్రకృతి మనకు ఎంతో అందిస్తుంది.. మనం కూడా ప్రకృతికి ఎంతో కొంత  అందించాలి’’.

అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 

మాతృభూమిని రక్షించడం.. సంరక్షించడం మన ప్రాథమిక బాధ్యత.. 

ఇవ్వాల్టి వాతావరణ పరిస్థితులు ఇవే చెబుతున్నాయి.. ఎందుకంటే ఈ బాధ్యతను చాలా మంది విస్మరించారు.. విపత్తుల లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.. పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి అంటూ ప్రధాని మోడీ మరోసారి గుర్తుచేశారు.. 

శుక్రవారం చెన్నై వేదికగా పర్యావరణం ? వాతావరణ సుస్థిరతపై ఉ20 మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ వర్చువల్‌ గా ప్రసంగించారు. చరిత్ర, గొప్ప సంస్కృతితో కూడిన చెన్నైకి విచ్చేసిన జీ20 మంత్రులకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ మామల్లపురంని అన్వేషించడానికి కొంత సమయం లభిస్తుందని ఆశిస్తున్నానని.. అక్కడున్న రాతి శిల్పాలు, గొప్ప కళలను తప్పక సందర్శించాలని జీ20 ప్రతినిధులకు సూచించారు.ఈ సందర్భంగా సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం వ్రాసిన తిరుకురల్‌ నుంచి ఉటంకిస్తూ.. సాధువు తిరువల్లువర్‌ గ్రంధంలో చెప్పిన విషయాలను ప్రధాని మోడీ ఈ సందర్భంగా వివరించారు. ‘‘జలాలను పైకి లాగిన మేఘం.. వర్షం రూపంలో తిరిగి ఇవ్వకపోతే మహాసముద్రాలు కూడా కుంచించుకుపోతాయి’’ అని పేర్కొన్నారు. 

భారతదేశంలో ప్రకృతి దాని మార్గాలు నేర్చుకునే సాధారణ వనరులు.. ఇవి అనేక గ్రంథాలలో అలాగే మౌఖిక సంప్రదాయాలలో కనిపిస్తాయన్నారు. భారతదేశ సాంప్రదాయ జ్ఞానం ఆధారంగా, వాతావరణ చర్య తప్పనిసరిగా ‘‘అంత్యోదయ’’ను అనుసరించాలని మోడీ పిలపునిచ్చారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ముఖ్యంగా వాతావరణ మార్పు ? పర్యావరణ సమస్యల వల్ల ప్రభావితమవుతాయి. ‘‘ఙఔ క్లైమేట్‌ కన్వెన్షన్‌’’, ‘‘పారిస్‌ ఒప్పందం’’ క్రింద ఉన్న కట్టుబాట్లపై మెరుగైన చర్య అవసరం అని ప్రధాని మోడీ గుర్తుచేశారు.భారతదేశం తన ప్రతిష్టాత్మకమైన విధానాల వైపు పయనిస్తుందని నిర్దేశించిన 2030 లక్ష్యానికి తొమ్మిదేళ్లు ముందుగా శిలాజ రహిత ఇంధన వనరుల నుంచి దాని వ్యవస్థాపించిన విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించిందని ప్రధాని మోడీ తెలిపారు. నేడు, వ్యవస్థాపించి న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పరంగా ప్రపంచంలోని మొదటి 5 దేశాలలో భారతదేశం ఒకటని.. 2070 నాటికి ‘‘నెట్‌ జీరో’’ సాధించాలనే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నామని మోడీ తెలిపారు. ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌, అఆఖీఎ, ‘‘లీడర్‌షిప్‌ గ్రూప్‌ ఫర్‌ ఇండస్ట్రీ ట్రాన్సిషన్‌’’తో సహా భాగస్వామ్యం ద్వారా తమ భాగస్వామస్య దేశాలతో కలిసి పని చేస్తూనే ఉన్నామన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....