నేడు పిఆర్‌ కళాశాలలో నానో టెక్నాలజీపై సెమినార్‌

  
కాకినాడ, జులై 14,(ఇయ్యాల తెలంగాణ ): కాకినాడలోని పిఆర్‌ ప్రభుత్వ కళాశాలలో నానో టెక్నాలజీ, బయో మెడికల్‌ అప్లికేషన్స్పై శనివారం జాతీయ స్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బివి తిరుపణ్యం తెలిపారు. ఈ సందర్భంగా తిరుపణ్యం కళాశాలలోని ఆయన చాంబర్లో ఈ సెమినార్కు సంబంధించి వివరాలను వెల్లడిరచారు.    శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నోవెల్‌ మెటీరియల్స్‌, నానో టెక్నాలజీ, బయో మెడికల్‌ అప్లికేషన్స్పై ఈ సెమినార్‌ నిర్వహిస్తామని ఈ సెమినార్కు సుమారు 500 మంది వరకు హాజరవుతారని ఈ సెమినార్లో రీసెర్స్‌ స్కాలర్స్‌ , పీజీలకు ట్రిపుల్‌ ఐటీ పూర్వ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి భగవన్నారాయణ వివరిస్తారన్నారు. ఈ సెమినార్లో ఆయన ప్రసంగం వారిని పరిశోధన వైపు మళ్ళించేలా మూడు విభాలుగా బోధిస్తారని చెప్పారు. ఈ సెమినార్కు ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్‌ సహకారం నిర్వహిస్తున్నామని, స్థానికంగా అలుమ్ని, వాకర్స్‌ అసోసియేషన్లు సహకరిస్తున్నట్లు చెప్పారు.  ఈ కార్యక్రమానికి అక్ను విసి, రిజిస్టర్లను కూడా ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ తిరుపణ్యం వెల్లడిరచారు.      ఈ సమావేశంలో కెమిస్ట్రీ హెచ్‌ఓడి డాక్టర్‌ డి చెన్నారావు, ఫిజిక్స్‌ హెచ్‌ఓడి యు కృష్ణ ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....