నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ

నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ

హైదరాబాద్ మే 19, (ఇయ్యాల తెలంగాణ )
బహదూర్ పుర నియోజక వర్గం పరిధిలోని పలు డివిజన్ ల పరిధిలో ఈ రోజు కూడా పేద ప్రజలకు నిత్యావసర పంపిణీ కార్యక్రమం కొనసాగింది. గత లాక్ డౌన్ మొదలైన నాటి నుండి పేద ప్రజల కోసం ఎం ఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో పలు రకాలుగా సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి. కొద్ధి రోజులుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా మంగళ వారం బహదూర్ పుర నియోజక వర్గం పరిధి లోని దూద్ బౌలి డివిజన్ లో గల సాలార్ ఏ మిల్లత్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ రోజు పేద ప్రజలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు.
మజ్లిస్ పార్టీ అధినేత,హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిష్టర్ అసదుద్దీన్ ఆదేశాల మేరకు ఈ రోజు సుమారు 200 కుటుంబాలకు బహదూర్ పుర నియోజక వర్గం పరిధిలో నిత్యావసరాల కిట్ల పంపిణీ జరిగింది. బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మోజం ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం. ఏ. గఫార్ పాల్గొని పేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....