నా భూమి` నా దేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఆదాల.

నెల్లూరు ఆగష్టు 19 (ఇయ్యాల తెలంగాణ );  నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 23వ  మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్‌ వడారుపల్లి పార్కులో శనివారం నా భూమి`నా దేశంకార్యక్రమాన్ని నిర్వహించారు. నా భూమి` నాదేశం కార్యక్రమానికి  నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్‌ ఇన్చార్జి  అదాల ప్రభాకర్‌ రెడ్డి హాజరయ్యారు. పడారుపల్లి  పార్కులో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నా భూమి`నా దేశం కార్యక్రమంలో భాగంగా నేల తల్లికి నమస్కారం` వీరులకు వందనంకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత దేశ రక్షణ వ్యవస్థలో సైనికులుగా దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను ముఖ్య అతిథిగా ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి  ఘనంగా సన్మానించారు. అంతకుముందు  ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి  పార్కు ఆవరణంలో  నా భూమి ` నా దేశం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అదే ప్రాంతంలో జాతీయ జెండాను ఎంపీ  ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....