దేవయ్య మృతి తీరని లోటు – బండి నరేష్

దేవయ్య మృతి తీరని లోటు – బండి నరేష్ 


హైదరాబాద్ మే 15 : ( ఇయ్యాల తెలంగాణ )
తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఉన్నతికి అహర్నిశలు కృషి చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ  కమీషన్ సభ్యులు సుంకపాక దేవయ్య మరణం దళిత జాతికి తీరని లోటని పలువురు దళిత సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేశారు. దళితుల కోసం పోరాటం చేసిన ఒక నాయకుడు నేల  కొరిగాడని ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం అయన నివాసంలో పలువురు నాయకులూ అయన భౌతిక కాయాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. ఈ మేరకు పాత నగరం నుంచి జాతీయ ఎం ఆర్ పి ఎస్ ఉపాధ్యక్షులు బండి నరేష్ రామ్ నగర్ లోని నివాసంలో సుంకపాక దేవయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బండి నరేష్ మాట్లాడుతూ దేవయ్య మాదిగ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....