ఒంగోలుజులై 26, (ఇయ్యాల తెలంగాణ ):పోలాల్లోకి దూసుకుపోయిన ప్రైవేటు బస్సు
ప్రయాణికులు క్షేమం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఒక టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం కొమరోలు సవిూపంలో ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తం కావటంతో భారీ ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ నగరానికి చెందిన టూరిస్ట్ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది ప్రయాణికులువున్నారు. తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు.