డల్లు జయంతి సందర్బంగా పాఠ్య పుస్తకాల పంపిణీ

హైదరాబాద్,సెప్టెంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ) :  కాంగ్రెస్  పార్టీ  సీనియర్ నాయకులు దివంగత డల్లు సత్యనారాయణ 79 వ జయంతి సందర్భంగా డల్లు యువసేన ఆధ్వర్యంలో ఈ రోజు పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కసరట్ట లోని గవ్నమెంట్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. డల్లు యువసేన నిర్వాహకుడు డల్లు సత్యనారాయణ తనయుడు డల్లు శివ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా డల్లు శివ మాట్లాడుతూ మా నాన్న గారైన డల్లు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అహర్నిశలు పాటుపడ్డారని పేద ప్రజల జీవన స్థితిగతుల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి విద్య, ఉపాధి కోసం కృషి చేసే వారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతు సహకారం సమాజానికి అందిస్తానని డల్లు శివ తెలిపారు.                 ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....