టైటాన్‌ ఘటనపై కెనడా విచారణ

న్యూఢల్లీి, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ ):

అట్లాంటిక్‌ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్‌ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌  కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్రమైన ఒత్తిడి వల్ల  టైటాన్‌ పేలిపోయింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్‌ కోస్ట్‌గార్డ్‌  ప్రకటించింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది.ఈ ఘటనపై కెనడా  విచారణ ప్రారంభించింది. సబ్‌ ఉపరితల నౌక పోలార్‌ ప్రిన్స్‌ కెనడియన్‌ ఫ్లాగ్‌డ్‌ షిప్‌ అయినందున ఈ సంఘటనపై దర్యాప్తు ) చేపట్టినట్లు కెనడా ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌  తెలిపింది.శతాబ్దం క్రితం అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు.. ఓషన్‌ గేట్‌ ఎక్స్‌ పిడీషన్స్‌ అనే సంస్థ ఈ సాహసయాత్రను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ యాత్రకు ఆదివారం మినీ టైటాన్‌ బయలు దేరింది. ఈ మినీ జలాంతర్గామిలో 96 గంటలకు సరిపాడా ఆక్సిజన్‌ ఉంది. అయితే, సాగరగర్భంలోకి వెళ్లిన గంటా 45 నిమిషాల తర్వాత టైటాన్‌ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో దాని జాడ కోసం కెనడా, అమెరికా దళాలు సముద్రాన్ని నాలుగు రోజుల పాటు జల్లెడపట్టాయి. అయినా ఫలితం లేకపోయింది. సముద్రం లోపల తీవ్రమైన ఒత్తిడి వల్ల  టైటాన్‌ పేలిపోయింది. అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....