చిలుకూరు బాలాజీ దర్శనం ఇప్పట్లో ఉండదు : రంగరాజన్

చిలుకూరు బాలాజీ దర్శనం ఇప్పట్లో ఉండదు : రంగరాజన్

8 వ తేదీ తరువాత భక్తులెవరూ ఆలయానికి రావొద్దు

హైదరాబాద్‌,జూన్‌1(ఇయ్యాల తెలంగాణ):  లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు  ఇచ్చి ఈ నెల  8 నుంచి ప్రార్థనా మందిలు  తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే చిలు కూరు బాలాజీ ఆలయం మాత్రం తెరుచుకోదని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు.ఈ మేరకు  ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  చిలుకూరు బాలాజీ స్వామికి ప్రతి రోజు ఏకాంత పూజలు  జరుగుతున్నాయని, కానీ, 8వ తేదీన ఆలయం తెరవబోమని పేర్కొన్నారు. ఆలయం తెరచి భక్తులకు ఎప్పుడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే వివరాలు  వ్లెల్లడిస్తామని చెప్పారు. అంతవరకు భక్తులు  ఎవరు కూడా 8 వ తేదీ నుంచి ఆలయానికి రావొద్దని భక్తులకు సూచించారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....