బద్వేలు జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): బద్వేలు నియోజకవర్గ ఇంచార్జ్,మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, రితీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.. భవిష్యత్ కార్యాచరణ,ప్రణాళికను పార్టీ బలోపేతానికై చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చించారు. . ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ Iయువగళం పాదయాత్రను బద్వేలు నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా నిర్వహించారని,కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొంటూ,ఓటర్ వెరిఫికేషన్,ఇంటింటికి సర్వే,మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారికి సూచించారు.
చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
Leave a Comment