కొత్త అలయన్స్‌ పేరు ‘ఇండియా’

 బెంగళూర్‌, జూలై 18, (ఇయ్యాల తెలంగాణ ): బీజేపీని ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్ష కూటమికి  ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని అధికారికంగా ప్రకటించవలసి ఉంది.  ఎ ` ఇండియా, ఔ ` నేషనల్‌, ఆ ` డెమొక్రాటిక్‌, ఎ ` ఇంక్లూజివ్‌, ం ` అలయెన్స్‌ (‘ఇండియా’  )గా నూతన కూటమికి పేరు పెట్టినట్లుగా తెలిపారు.మొదట ఆర్జేడీ పేరు ను ట్వీట్‌ చేసి డిలీడ్‌ చేసింది. అధికారికంగా అందరూ కలిసి ప్రకటిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.  బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఆప్‌, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్‌ పవార్‌ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీ, అప్నాదళ్‌ (కే), నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఆర్‌ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ (ఎం), కేరళ కాంగ్రెస్‌ (జోసఫ్‌) పార్టీలు పాల్గొన్నాయి.ప్రతిపక్ష పార్టీల సమావేశంలో  ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్‌ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు.  భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చునని చెప్పారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు.ఈ సమావేశానికి హాజరైన 26 పార్టీలకు తగినంత రాజకీయ బలం ఉందని విపక్ష కూటమి నేతలు చెబుతున్నారు.  11 రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. కూటముల ప్రాధాన్యాన్ని వివరించారు. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలను దక్కించుకుందని, ఈ స్థానాలను ఆ పార్టీ తనంతట తాను గెలుచుకోలేదని  ఖర్గే ప్రకటించారు.  బీజేపీ తన మిత్ర పక్షాల ఓట్లను పొంది, అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ మిత్ర పక్షాలను వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు రాష్ట్రాల్లో తిరుగుతూ, పాత మిత్రులతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారన్నాని ఎద్దేవా చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....