కేజ్రీవాల్‌ రక్తనమూనాల సేకరణ – కరోనా పరీక్షల ఫలితం రేపు వెల్లడి

(  ఫైల్ ఫోటో )

కేజ్రీవాల్‌ రక్తనమూనాల  సేకరణ

కరోనా పరీక్షల  ఫలితం రేపు వెల్లడి
న్యూఢిల్లీ ,జూన్‌9(ఇయ్యాల తెలంగాణ): ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు వైద్యులు  కరోనా పరీక్షలు  నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి  కరోనా లక్షణాలైన గొంతునొప్పి, జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. దీంతో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న కేజీవ్రాల్‌ నుంచి వైద్యులు  నమూనాలు  సేకరించారు.  బుధవారం ఉదయానికి ఫలితాలు  వచ్చే అవకాశం ఉన్నది. కరోనా లక్షణాలతో సీఎం కేజీవ్రాల్‌ ఆదివారం మధ్యాహ్నం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ’ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారని’ ఢిల్లీ  ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సామాజిక వ్యాప్తి, ప్రైవేట్‌ దవాఖానలపై చర్చించడానికి మనీశ్‌ సిసోడియా నేతృత్వంలో ఈరోజు మంత్రిమండలి
సమావేశం జరిగింది.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....