హైదరాబాద్, మార్చి 21 (ఇయ్యాల తెలంగాణ) : గర్భిణీ మహిళలకు పోషణ పోషక విలువల కోసం కేంద్ర సర్కారు ఏంతో కృషి చేస్తుందని గోల్కొండ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అనుముల పద్మ అన్నారు. పాతబస్తీ ఇందిరా నగర్ అంగన్ వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని గర్భిణీ మహళలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అందిసుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లు ANM ,అంగన్ వాడి, ఆశ లు పాల్గొన్నారు.