కాశ్మీర్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం.
శ్రీనగర్,మే19(ఇయ్యాల తెలంగాణ ): జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్లోని నవకాడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు , సిఆర్పిఎఫ్ జవాన్లు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని భధ్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతోపాటు కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడి కొడుకు కూడా మృతి చెందాడు. భద్రతా బలగాలు , ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించగా.. ఒక పోలీస్ అధికారి, ఓ జవానుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.