‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి పెరగకుండా కొత్త మార్గదర్శకాలు

G. O విడుదల చేసిన  తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి ఎక్కువ కాకుండా నివారించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, వేడుకలతో పాటు సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని జనం ఒకే దగ్గర ఎక్కువగా గుమికూడా కుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎటువంటి వేడుకలకైనా ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ మాస్కులు తప్పని సరిగా ధరించాలని, అదే విధంగా భౌతిక దూరం పాటించాలని సూచనలు చేసింది. అధికారులు రాష్ట్రంలో విధించిన కొత్త ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని తెలిపింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....