ఆరు భారతీయ భాషలకు ప్రాచీన హోదా : కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మార్చి 24 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాళం, ఒడియా వంటి భాషలకు భారత ప్రభుత్వం ప్రాచీన భాష హోదా కల్పించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి  జి.కిషన్‌ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ ప్రాచీన భాషలను యునెస్కో బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చేర్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఒడియా వంటి ప్రాచీన భాషతోపాటు అన్ని భారతీయ భాషల ప్రోత్సాహంపై నూతన విద్యా విధానం దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....