మంథని జులై 3,(ఇయ్యాల తెలంగాణ ):గురు పౌర్ణమిని పురస్కరించుకొని సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఐటీ కన్సల్టెంట్ ముప్పిడి ఉదయరాజ్ ` సరిత (హన్మకొండ) దంపతుల సహకారం తో పుట్టపాక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కావాల్సిన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లతో పాటు బిస్కెట్ ప్యాకెట్లను విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రిటైర్డ్ టీచర్ కొరకొప్పుల రాజశేఖర్, పుట్టపాక సర్పంచ్ రొడ్డ మమతా శ్రీనివాస్, ట్రస్ట్ చైర్మన్ మేడగొని వెంకటేష్, స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసన్న, శోభన్ బాబు, తిరుమలేశ్వర్, ముప్పిడి సూతిక్షన్, షణ్ముకి పాల్గొన్నారు