చార్మినార్, మార్చి 10 (ఇయ్యాల తెలంగాణ) : కాశ్మీర్ ఫైల్స్ మూవీ టీమ్ బుధవారం చార్మినార్ భాగ్యలక్మీ టెంపుల్ దగ్గర అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మాట్లాడుతూ ది కాశ్మీర్ ఫైల్ మూవీ ప్రారంభం భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ నుంచే మొదలైందని తెలియజేశారు. ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ యాక్టర్ లు దర్శన్ కుమార్ లు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్టీ శశికళ కాశ్మీర్ ఫైల్ మూవీ టీమ్ ను సాదరంగా ఆహ్వానించడంతో పాటు వారికి ఏళ్ల వేళలా అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని అన్నారు. ఆలయ కమిటీ సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహింహడంతో పాటు సినిమా టీమ్ ను శాలువాలతో సన్మానించారు.