పసడి పరుగులు

ముంబై, సెప్టెంబర్‌ 20, (ఇయ్యాల తెలంగాణ ); ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్‌ మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. సాధారణంగా వివాహాలు, శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగులు పెడుతున్నాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,220 లు గా ఉంది. అయితే, బంగారంపై రూ.170 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.300 మేర పెరిగి రూ.74,800 లకు చేరింది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..ఢల్లీిలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,370 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500, 24 క్యారెట్ల ధర రూ.60,550, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,220, కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220 లుగా ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,220 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,220 కి చేరింది.ఢల్లీిలో వెండి కిలో ధర రూ.74,800 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,800, చెన్నైలో కిలో వెండి ధర రూ.78,300, బెంగళూరులో రూ.73,250 గా ఉంది. కేరళలో రూ.74,800, కోల్‌కతాలో రూ.74,800 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.78,300, విజయవాడలో రూ.78,300, విశాఖపట్నంలో రూ.78,300 లుగా కొనసాగుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....